వికారాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇద్దరికి జైలుశిక్ష, బహిరంగంగా మద్యం సేవించిన నలుగురికి జరిమానాను కోర్టు విధించినట్లు మంగళారం వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు. అతిగా మద్యం సేవించి వికారాబాద్ పోలీసులకు పట్టుబడిన రాజు అనే వ్యక్తికి మూడు రోజులు, రామస్వామి అనే వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించారన్నారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్న నలుగురికి జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.