హైదరాబాద్ : ద్విచక్ర వాహనం, బోర్వెల్ లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సాగర్ రోడ్డులోని సాగర్ కాంప్లెక్స్ వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నది. మృతులను ఏవీఎన్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.