హైదరాబాద్ : రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాచిగూడ పరిధి బద్వేలు రైల్వేస్టేషన్లో ప్రవీణ్(19) అనే యువకుడు గూడ్స్ రైలు ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్కు దాటుతుండగా విద్యుదాఘాతానికి గురై చనిపో్యాడు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పంతులుతండాలో పొలంలో రవి(35) అనే రైతు కరెంట్షాక్కు గురై మృతిచెందాడు. రవి మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు మృతదేహంతో విద్యుత్ సబ్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.