మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంటలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన తొర్రూరు పట్టణం రాజీవ్ నగర్లో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. సిరిపాటి మహంకాళి(6) అనే బాలుడు ఇంటి పక్కనే ఆడుకుంటూ బాత్ రూమ్ల కోసం తీసిన నీటి గుంటలో పడి మృతి చెందాడు. తల్లిదండ్రులు బాలుడి కోసం వెతకగా నీటి గుంటలో శవమై కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు.