కాచిగూడ : ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనం మాయమయిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డిఎస్సై రాజేంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం కామ్గార్నగర్ ప్రాంతానికి చెందిన కొమ్యూరి దుర్గయ్య (50) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఎప్పటిలాగే ఈ నెల 29న ఇంటి ముందు టీఎస్ 12 ఈబీ 8840 ద్విచక్రవాహనాన్ని పార్కింగ్ చేశాడు. తెల్లవారు జామున చూసేప్పటికీ ద్విచక్రవాహనం కనబడలేదు. చుట్టు పక్కల, ఇతర ప్రాంతాల్లో వెతికినా ఆచూకి లభించలేదు. దీంతో సోమవారం దుర్గయ్య కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.