కాచిగూడ: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మరణించిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎసై సత్తార్అలీ తెలిపిన వివరాల ప్రకారం…తిలక్నగర్ సెయింట్ హన్నాస్ స్కూల్ ప్రాంతంలో నివాసముండే ఎన్.సాయికిరణ్ (29) కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు.
ఈ నెల 14న ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకున్నాడు. దీన్ని పక్కనే ఉన్నవారు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.