మణికొండ : మద్యం మత్తులో అతివేగంగా వాహనాన్ని నడిపి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన సంఘటనలో సోమవారం భార్యభర్తలు దుర్మరణం చెందడానికి కారణమైన కారుడ్రైవర్ను మంగళవారం నార్సింగి పోలీసులు రిమాండ్కు తరలించారు.
కోకాపేట గ్రామానికి చెందిన దుర్గం రాజు, దుర్గం మౌనిక దంపతులు స్కూటీపై రోడ్డు పక్క నుంచి ఎదురుగా వస్తుండగా మద్యం మత్తులో మొకిల గ్రామానికి చెందిన కారు డ్రైవర్ చిట్టంపల్లి సంజీవ (30) ఢీ కొట్టడంతో దంపతులిద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
ఈ ఘటన తీవ్రకలకలం రేపింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కారుడ్రైవర్ను మంగళవారం రిమాండ్కు తరలించినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.