కోల్కతా : మహిళను వేధింపులకు గురిచేసిన సిలిగురి బాయ్స్ హైస్కూల్ టీచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బుధవారం జరగ్గా నిందితుడిని ప్రబీర్ బర్మన్గా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ప్రబీర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రవీంద్ర నగర్లో నివసించే మహిళ ఇంట్లోకి తాగిన మైకంలో చొరబడిన నిందితుడు వేధింపులకు గురిచేశాడు. ఆమె మెట్టినింటి వారు మరణించడంతో మహిళ ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాడు. 2019లోనూ మహిళ నిందితుడిపై లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న కేసును ఉపసంహరించుకోవాలని నిందితుడు తనపై ఒత్తిడి తీసుకువచ్చాడని తాజా ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
ఆపై తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించారు. బాధితురాలు చెబుతున్నవన్న అసత్యాలని నిందితుడు ప్రబీర్ బర్మర్ తోసిపుచ్చుతూ మహిళ తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.