జైపూర్ : రాజస్దాన్లోని దోల్పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యం నయం చేస్తానని నమ్మబలికిన నకిలీ బాబా మహిళ(35)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేరాన్ని వీడియో తీసిన నిందితుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని మహిళను బెదిరించాడు.
బాబాపై కుమారుడితో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనారోగ్యం తగ్గిస్తానని గత రెండేండ్ల నుంచి ప్రతి గురువారం మహిళను రప్పించేవాడు. ఏప్రిల్ 21న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
తనను బెదిరించిన నిందితుడు రూ 50,000 తీసుకున్నాడని మహిళ ఆరోపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.