సిద్దిపేట హ్యాండ్లూమ్ ఏడీ వెంకటరమణ ఏసీబీ వలకు చిక్కాడు. ఆర్మూర్కు చెందిన ఓ వ్యక్తినుంచి రూ. 20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కే వెంకటరమణ.. సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల ఇన్చార్జిగా పనిచేస్తున్నారు.
కాగా, ఓ పనికోసం వచ్చిన ఆర్మూర్కు చెందిన వ్యక్తిని రూ. 20వేలు లంచం డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సిద్దిపేటలోని తన కార్యాలయంలో సదరు వ్యక్తినుంచి వెంకటరమణ రూ. 20వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్, సిబ్బంది రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.