హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పేద క్రైస్తవులను గుడ్ షెపర్డ్, ఆర్ అండ్ ఆర్ ఫౌండేషన్ కలిసి భారీగా మోసం చేశాయి. చర్చిలు, విల్లాలు, ఇండ్ల నిర్మాణం పేరుతో రూ. 50 కోట్ల మేర వసూలు చేశారు. కానీ బాధిత వ్యక్తులకు ఇండ్లను కేటాయించలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆర్ అండ్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రఘురామ్, డైరెక్టర్ సాల్మన్రాజ్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 20 వేల మంది మోసపోయినట్లు బాధితులు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో వెయ్యి చర్చిలతో పాటు పాస్టర్లకు విల్లాలు, పేద క్రైస్తవులకు ఇండ్లు నిర్మిస్తామని మోసం చేశారు. ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు.