న్యూఢిల్లీ : డ్రగ్స్ దందాలో దిగిన ప్రముఖ భోజ్పురి సింగర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని భోజ్పురి గాయకుడు వినయ్ శర్మ (31)గా గుర్తించారు. వినయ్ శర్మ ఇప్పటివరకూ 100కి పైగా పాటలు పాడాడు.
డ్రగ్స్ వ్యాపారి వినయ్ శర్మ కొందరిని కలుసుకునేందుకు ఇంద్రపురికి వస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వలపన్ని పట్టుకున్నాడు. నిందితుడిని స్పాట్లోనే అరెస్ట్ చేసిన అధికారులు అతడి నుంచి 21.508 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.