న్యూఢిల్లీ: ఒక వృద్ధుడి మీదుగా కారు దూసుకెళ్లింది. ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో బుధవారం ఈ సంఘటన జరిగింది. ఒక వృద్ధుడు తన ఇంటి ముందు కుర్చీ వేసుకుని కుర్చొనేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ఇరుకైన ఆ సందులోకి ఒక కారు ప్రవేశించింది. కుర్చీని పట్టుకుని నిల్చొన్న వృద్ధుడి మీదుగా ఆ కారు దూసుకెళ్లింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం అనంతరం డ్రైవర్ డ్రైవర్ ఆ కారును ఆపకుండా వెళ్లిపోయాడు.
అయితే, ఉద్దేశపూర్వకంగా తన పైనుంచి కారును దూకించినట్లు ఆ వృద్ధుడు ఆరోపించాడు. పొరుగువారితో ఆరు నెలల కిందట జరిగిన గొడవే దీనికి కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సమీపంలోని ఇంటి సీసీటీవీలో రికార్డైన వీడియో ఫుటేజ్ను పరిశీలించారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి దారుణం జరిగింది. రోడ్డును దాటుతున్న ఒక వ్యక్తిపైకి ఎస్యూవీ వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సెంట్రల్ ఢిల్లీలోని జనపథ్లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న ఒక ఎస్యూవీ వాహనం నడుస్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 39 ఏండ్ల వ్యక్తి చనిపోయాడు. ఈ ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనాన్ని నిలుపకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వారు షాకయ్యారు. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video Shows Horrific Accident In Central Delhi, SUV Runs Over Pedestrian https://t.co/9GpCje85xa pic.twitter.com/NTSnWqEg0U
— NDTV (@ndtv) March 30, 2022