భోపాల్: ప్రియుడితో కలిసి అతడి ఇంట్లో ఉన్న వివాహిత గిరిజన మహిళ పట్ల గ్రామస్తులు దారుణంగా వ్యవహరించారు. ఆమెను కొట్టి, మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. అంతేగాక భర్తను ఆమె భుజంపై మోయించారు. మధ్యప్రదేశ్లోని దేవస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బోర్పడావ్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల గిరిజన మహిళ వారం రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కనిపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ మహిళ తన ప్రియుడైన 26 ఏళ్ల వ్యక్తితో కలిసి అతడి ఇంట్లో ఉంటున్నట్లు భర్తకు తెలిసింది.
దీంతో ఆదివారం తన పిల్లలు, గ్రామస్తులతో కలిసి భర్త అక్కడికి వెళ్లాడు. ప్రియుడితో కలిసి అతడి ఇంట్లో ఉన్న ఆమెను జట్టుపట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చారు. ఆపై దారుణంగా కొట్టారు. మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. భర్తను ఆమె భుజాలపై బలవంతంగా మోయించారు. భర్త, పిల్లలతోపాటు గ్రామస్తులు ఆ మహిళను దారుణంగా కొట్టి హింసించారు.
కాగా, మహిళ ప్రియుడు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఆ గ్రామానికి వెళ్లారు. మహిళ, ఆమె ప్రియుడ్ని రక్షించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే 15 ఏళ్లకే తనకు పెళ్లి అయ్యిందని, తన భర్త నిత్యం తనను హింసిస్తున్నాడని, అందుకే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఆ మహిళ పోలీసులకు చెప్పింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు 26 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మహిళను కొట్టి ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించిన భర్తతో సహా 12 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు స్థానికుల్లో కొందరు తమ మొబైల్ ఫోన్లలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
In Madhya Pradesh's Dewas district, people brutally beat up a "Tribal Woman" just because she went with her lover. Aren't we living in a free country @ChouhanShivraj ?? What was her fault??
Where is NDA's candidate for President election, Draupadi Murmu?? Why is she SILENT?? pic.twitter.com/o3afyRtW6U
— Rajasthan Congress Sevadal (@SevadalRJ) July 4, 2022