గురుగ్రాం : మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలి గురుగ్రాంలోని భోండ్సి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. జైలు సెల్ లో ఆత్మహత్య చేసుకున్న ఖైదీ తన అవయవాలను దానం చేయాలని సూసైడ్ నోట్ లో అధికారులను కోరారు. బలవన్మరణానికి పాల్పడిన ఖైదీని గౌతంగా గుర్తించారు.
సోహ్న అనే బాలికను వేధించిన కేసులో 2018లో గౌతంకు శిక్ష ఖరారైంది. గత కొన్నేండ్లుగా చర్మ వ్యాధితో బాధపడుతున్న గౌతం కొద్దిరోజులుగా దీనిపై మధనపడుతూ కుంగుబాటుకు లోనయ్యాడు. జైలు సెల్ లోనే విగతజీవిగా పడిఉన్న గౌతం ను రాత్రి గస్తీలో ఉన్న జైలు గార్డు గుర్తించి అధికారులకు సమాచారం అందించాడు.