ముంబై : క్యాన్సర్తో బాధపడుతున్న తండ్రి వైద్య చికిత్స కోసం 12 బైక్లను దొంగిలించిన వ్యక్తిని నాగపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఖండ్వాని పట్టణానికి చెందిన రిషభ్ (28)గా గుర్తించారు. సితాబుద్లి, జరిపట్క, లకడ్గంజ్, నందన్వన్, కొత్వాలి, గణేష్పేట్ పోలీస్స్టేషన్ల పరిధిలో నిందితుడు బైక్ చోరీలకు పాల్పడ్డాడు.
తండ్రి చికిత్స కోసం పెద్దమొత్తంలో డబ్బు అవసరం ఏర్పడటంతోనే రిషబ్ బైక్ల చోరీకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై దాదాపు 15 కేసులు నమోదయ్యాయని అతడిపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. రిషబ్ నుంచి 12 బైక్లతో పాటు రూ 4.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.