ముంబై: బ్యాంకును దోచిన ఒక వ్యక్తి తన తల్లిదండ్రులకు విలువైన బహుమతులు ఇచ్చాడు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ ఘటన జరిగింది. 18 ఏండ్ల అజయ్ బంజారే తన అనుచరుడు ప్రదీప్ ఠాకూర్తో కలిసి ఇందిరానగర్ బరానల్ స్క్వేర్లోని సహకార బ్యాంకులో రూ.4.78 లక్షల విలువైన నగలు, నగదును దోచుకున్నారు. కాగా, తన తల్లిదండ్రులకు బహుమతులు ఇచ్చి వారి మెప్పు పొందేందుకు అజయ్ ప్రయత్నించగా, తనను వదిలేసిన పెరేంట్స్పై ప్రదీప్ రివేంజ్ తీసుకునేవాడు. ఈ నేపథ్యంలో అజయ్ తన తల్లికి రూ.50,000 విలువైన బంగారు ఆభరణాలు, తన తండ్రికి రూ.40,000 విలువైన సెకండ్ హ్యాండ్ కారును కొని బహుమతిగా ఇచ్చాడు.
మిగతా సొమ్ముతో అజయ్, ప్రదీప్ ఖరీదైన మొబైల్ ఫోన్లతో పాటు సెకండ్ హ్యాండ్ కారును కొన్నారు. రాజస్థాన్కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండగా వారిద్దరిపై నిఘా పెట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు. దోచుకున్న చాలా సొమ్మును వారిద్దరు ఖర్చు చేయగా రెండు లక్షల విలువైన నగదు, వస్తువులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.