ముంబై : ఎలక్ట్రిసిటీ బిల్లే (Electricity Bill Scam) కాదు దాన్ని ఆన్లైన్లో చెల్లించాలన్నా కరెంట్ షాక్ కొట్టే పరిస్ధితి నెలకొంది. ఆన్లైన్లో విద్యుత్ బిల్లు చెల్లించే క్రమంలో లింక్ క్లిక్ చేసిన ఓ వ్యక్తి రూ. 7.35 లక్షలు కోల్పోయిన ఘటన వెలుగుచూసింది. ముంబైలోని ములుంద్కు చెందిన 72 ఏండ్ల రిటైర్డ్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి సైబర్ ఫ్రాడ్ స్కాంలో మోసపోయారు.
పెండింగ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ పేరిట స్కామర్లు పంపిన ఫేక్ నోటీస్ను అందుకున్న అనంతరం ఆయన ఏకంగా ఏడున్నర లక్షలు పోగొట్టుకున్నారు. ఎలక్ట్రిసిటీ బిల్ స్కామ్లో మోసపోయిన రఘునాధ్ కరంబెల్కర్ ఈ ఘటనపై నవఘర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించకుంటే విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని బాధితుడికి మహారాష్ట్ర విద్యుత్ బోర్డు అధికారి పేరుతో బాధితుడికి మెసేజ్ వచ్చింది.
తాను విద్యుత్ బిల్లు చెల్లించానని చెప్పినా అది రికార్డుల్లో నమోదు కాలేదని స్కామర్ నమ్మబలికాడు. తాను పంపిన వాట్సాప్ లింక్ను క్లిక్ చేస్తే సమస్య పరిష్కారమవుతుందని మభ్యపెట్టాడు. లింక్ను క్లిక్ చేసిన కరంబెల్కర్ అక్కడ అడిగిన వ్యక్తిగత వివరాలను నమోదు చేసి రూ 5 చెల్లించాడు. దీంతో బాధితుడి ఖాతా నుంచి రూ. 7 లక్షలకు పైగా డెబిట్ అయ్యాయి. సైబర్ పోలీసులకు సమాచారం అందించేలోగానే బాధితుడి ఖాతా నుంచి నిధులు విత్డ్రా అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Leopards | నాసిక్ వీధుల్లో పట్టపగలే చిరుతల సంచారం.. భయాందోళనలో ప్రజలు