జైపూర్ : ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్కు అశ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్లు పంపుతూ వేధించిన నిందితుడిని రాజస్ధాన్లోని జోధ్పూర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆర్ఓ ప్లాంట్లో పనిచేసే ధరంపాల్ రాయ్ (36)గా గుర్తించారు. యూపీలోని ఘజీపూర్కు చెందిన రాయ్ జోధ్పూర్ జిల్లాలోని సలవాస్ గ్రామంలోని ఆర్ఓ ప్లాంట్లో పనిచేస్తున్నాడు.
రాయ్ గత కొద్దిరోజులుగా ఢిల్లీ వర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్కు అశ్లీల మెసేజ్లు, వీడియోలు పంపుతూ వేధిస్తున్నాడు. ఆమెకు వీడియో కాల్స్ చేసి ఇబ్బందిపెట్టేవాడు. వాట్సాప్లో అభ్యంతరకర వీడియోలు పంపి వేధిస్తుండటంతో మహిళా ప్రొఫెసర్ జనవరి 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక సహకారంతో నిందితుడిని ట్రేస్ చేయగా రాజస్ధాన్లోని జోధ్పూర్ జిల్లా సలవాస్ గ్రామంలోని ఆర్ఓ ప్లాంట్ వద్ద అతడు పనిచేస్తున్నట్టు వెల్లడైంది.
ఢిల్లీ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాయ్ మొబైల్ ఫోన్ను సీజ్ చేశారు. ఫేస్బుక్ సెర్చ్ ద్వారా మహిళా ప్రొఫెసర్ నెంబర్ సేకరించానని, ఆమెకు అభ్యంతరకర మెసేజ్లు పంపానని నిందితుడు అంగీకరించాడు. ఆర్ఓ ప్లాంట్లో నిందితుడు ఆపరేటర్గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇతర మహిళలనూ ఇదే తరహాలో నిందితుడు గతంలో వేధించాడనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు.