హఫీజ్పేట్:రైలుకిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హఫీజ్పేట్ రైల్వేస్టేషన్కు సమీపంలో చోటుచేసుకున్నది. రైల్వేహెడ్ కానిస్టేబుల్ నర్సింహరావు తెలిపిన వివరాల ప్రకారం…సుమారు 45సంవత్సరాలుగల ఓవ్యక్తి బుధవారం రాత్రి 10గంటల ప్రాంతంలో హఫీజ్పేట్ రైల్వేస్టేషన్ సమీపానికి చేరుకొని ఆత్మహత్య చేసుకునే క్రమంలో పట్టాలపై పడుకున్నాడు.
దీంతో గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే సమాచారం అందుకున్న రైల్వేపోలీసులు అక్కడకు చేరుకున్నారు. చనిపోయినవ్యక్తి తలబాగం పూర్తిగా నుజ్జునుజ్జుకావడంతోపాటు చనిపోయినవ్యక్తి ఆధారాలు ఏమీదొరకలేదు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయినవ్యక్తి నీలంరంగు చొక్కా, నీలంరంగు ప్యాంటు ధరించి ఉన్నాడు ఇతర సమాచారం కోసం రైల్వేహెడ్కానిస్టేబుల్ నర్సింహరావును ఫోన్నంబర్ 9000394635లో సంప్రదించాలన్నారు.