తిరువనంతపురం : ఓ ముగ్గురు యువకులు కామంతో రగిలిపోయారు. మూగ జీవిపై విరుచుకుపడ్డారు. గర్భం ధరించిన మేకపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ మూగజీవిని చంపేశారు. ఈ దారుణ ఘటన కేరళలోని కాసరగాడ్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
స్థానికంగా ఉన్న ఎలైట్ హోటల్ యజమాని ఓ రెండు మేకలను పెంచుతున్నాడు. ఇందులో ఒకటి నాలుగు నెలల గర్భంతో కూడింది కాగా, మరొకటి పిల్ల మేక. అయితే హోటల్లో పని చేసే ముగ్గురు యువకులు.. మంగళవారం రాత్రి గర్భం ధరించిన మేకపై అత్యాచారానికి పాల్పడ్డారు. మేక అరుపులు విన్న ఇతరులు.. అక్కడికి వచ్చి చూసేసరికి, యువకుల దారుణాన్ని చూసి విస్తుపోయారు. అంతలోనే ఆ ముగ్గురు గోడ దూకి పారిపోయారు. మేక కూడా చనిపోయింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురిలో ఒకరైన సెంథిల్ను పోలీసులు అరెస్టు చేశారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అయితే సెంథిల్ తమిళనాడుకు చెందిన యువకుడు కాగా, హోటల్లో పని చేసేందుకు మూడు నెలల క్రితం వచ్చినట్లు యజమాని పోలీసులకు తెలిపారు.