చెన్నై : ఎనిమిదేండ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తిని (47) పోక్సో చట్టం కింద తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోయంబత్తూరుకు చెందిన రత్నంగా గుర్తించారు. నిందితుడు రత్నం బాధితురాలి తండ్రి నుంచి కొంత భూమిని కౌలుకు తీసుకునక్నాడు. మార్చి 2021 నుంచి బాలికను రత్నం వేధింపులకు గురిచేస్తున్నాడు.
బాలిక తన స్నేహితుల వద్దకు ఆడుకునేందుకు వెళుతుండగా అడ్డగించిన నిందితుడు ఆమెకు అశ్లీల వీడియోలు చూపుతూ వేధించాడు. బాలిక తన స్కూల్లో నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించిన క్రమంలో నిందితుడి ఆగడాలు వెలుగుచూశాయి. నిందితుడు తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న విషయాన్ని ఆమె అక్కడున్న వైద్యులకు తెలిపింది.
బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెపై లైంగిక వేధింపులు జరిగాయని నిర్ధారించారు. బాలిక తల్లితండ్రులు నిందితుడిపై తుదియలూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పోక్సో చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు.