రాంచీ : ఆస్తి వివాదంలో కన్నతండ్రిని పదునైన ఆయుధంతో పొడిచి చంపిన కొడుకు ఉదంతం జార్ఖండ్లోని గొడ్డా ప్రాంతంలో వెలుగుచూసింది. తన తమ్ముడికి ఆస్తిలో అధిక వాటా ఇచ్చి తనను చిన్నచూపు చూశాడనే కోపంతో నిందితుడు తన తండ్రి (70)ని అంతమొందించాడు.
తనకు ఆస్తిలో సమాన వాటా ఇవ్వాలని కోరగా తండ్రి నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన నిందితుడు సుభోద్ డిసెంబర్ 31న పదునైన ఆయుధంతో తండ్రి గొంతుకోసి చంపాడు. ఈ కేసును కేవలం 24 గంటల్లో ఛేదించామని గొడ్డా ఎస్పీ వైఎస్ రమేష్ తెలిపారు.
దర్యాప్తులో భాగంగా రక్తపు మరకలున్న వస్త్రాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పెద్దకుమారుడిపై అనుమానంతో అతడిని ప్రశ్నించగా షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి. ఆస్తిలో సమాన భాగం ఇవ్వనందుకే తన తండ్రిని హత్య చేశానని సుభోద్ అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని కస్టడీకి తరలించారు.