కొచ్చి : యాపిల్ ఐఫోన్ 12కు కేరళకు చెందిన ఓ వ్యక్తి ఆర్డర్ ఇవ్వగా పార్శిల్లో విమ్ బార్, రూ 5 కాయిన్ రావడంతో కస్టమర్ కంగుతిన్నాడు. కొచ్చికి చెందిన నూరుల్ అమీన్ అక్టోబర్ 12న అమెజాన్పై రూ 70,900 విలువ చేసే మొబైల్ ఫోన్ను ఆర్డర్ ఇచ్చాడు. అమెజాన్ పే కార్డు ద్వారా చెల్లింపులు పూర్తిచేశాడు. అక్టోబర్ 15న తనకు వచ్చిన ప్యాకేజ్ను ఓపెన్ చేసి చూసేముందు డెలివరీ బాయ్ ఎదుట అన్బాక్సింగ్ వీడియో తీయాలని నిర్ణయించుకున్నాడు.
ఇక ప్యాక్ను తెరిచి చూడగా అందులో విమ్ డిష్వాష్ బార్ , రూ 5 కాయిన్ ఉండటంతో షాక్ తిన్నాడు. దీంతో అమీన్ సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఫోన్ కవర్పైన ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమీన్కు రావాల్సిన ఫోన్ను సెప్టెంబర్ నుంచి జార్ఖండ్లో ఓ వ్యక్తి వాడుతున్నట్టు గుర్తించారు. అమెజాన్ అధికారులు, హైదరాబాద్కు చెందిన సెల్లర్ను తాము సంపద్రించగా ఈ ఫోన్ స్టాక్ అయిపోయిందని నూరుల్ చెల్లించిన మొత్తం రిఫండ్ చేస్తామని బదులిచ్చారని దర్యాప్తు అధికారి తెలిపారు.