ముంబై : మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీ రెడ్లైట్ ఏరియాలో ఇద్దరు సెక్స్ వర్కర్లపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ముజహిదిన్ షేక్ (40), అర్బాజ్ జావేద్ షేక్ (24)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం రెడ్లైట్ ఏరియాకు చేరుకున్న నిందితులు అక్కడ దందా నిర్వహిస్తున్నందుకు తమకు రూ 1500 చెల్లించాలని ఇద్దరు సెక్స్ వర్కర్లను డిమాండ్ చేశారు.
డబ్బు చెల్లించేందుకు బాధితురాళ్లలో ఒకరు నిరకారించడంతో నిందితుడు ఆమె జుట్టుపట్టుకుని లాగడంతో పాటు కిందకు తోసివేశాడు. ఆపై తీవ్రంగా కొడుతుండగా మరో మహిళ దాడి దృశ్యలను షూట్ చేస్తోంది. బాధితురాళ్ల ఫిర్యాదు ఆధారంగా నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యయత్నం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇక ముంబైలో జరిగిన మరో ఘటనలో స్టాక్ మార్కెట్లో నష్టాలు రావడంతో మనస్ధాపానికి లోనైన యువకుడు (24) నాటు తుపాకీతో కాల్పులు జరుపుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని బాంద్రా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తలపై కాల్చుకుని తనువు చాలించిన బాధితుడిని మయాంక్ జయేష్గా గుర్తించారు.