న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కొత్త ఇల్లు కొన్నాడు. ముంబైలోని జూహూ ప్రాంతంలో ఇటీవల అతను 47.5 కోట్లు పెట్టి కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే దాని కోసం సుమారు 18.75 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాపోల్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీలో బిల్డింగ్ ఉంది. మే 7వ తేదీన దేవగన్ ఫ్యామిలీ పేరిట బిల్డింగ్ను ట్రాన్సఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన శివశక్తి బంగ్లాలో ఉంటున్నారు. జూహూలోనే దేవగన్ 60 కోట్ల ఇల్లు కొన్నట్లు గతంలో ఓ రిపోర్ట్ వచ్చింది. హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, అక్షయ్ కుమార్తో పాటు ఇతర సెలబ్రిటీలు దేవగన్ పొరుగువారు కానున్నారు.