హైదరాబాద్ : సికింద్రాబాద్లోని జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సీఆర్పీఎఫ్ క్యాంపులో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. క్యాంపులోని అసిస్టెంట్ కమాండెంట్ ఇంట్లోకి చొరబడిన దొంగలు సుమారు 12.5 తులాల బంగారాన్ని అపహరించారు. ఉదయం చోరీ విషయాన్ని గుర్తించిన అసిస్టెంట్ కమాండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్లూస్టీం, పోలీసులు ఇంటిని పరిశీలించి ఆధారాలు సేకరించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.