ముంబై: తన దీర్ఘకాల అనారోగ్యంపై విసుగుచెందిన ఒక వృద్ధుడు భార్యను కత్తితో పొడిచి చంపాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ దారుణం జరిగింది. పొవై ప్రాంతంలో నివాసం ఉండే వృద్ధుడు శంకర్ వికలాంగుడు. గత ఐదేండ్లుగా ఆరోగ్యం సరిగా లేక బాధపడుతున్నాడు. దీంతో విసుగుచెందిన అతడు ఆగస్ట్ 29న తెల్లవారుజామున నిద్రపోతున్న భార్య కొండబాయి త్రిముఖేపై పలు చోట్ల కత్తితో పొడిచాడు. ఆమె అరుపులకు కోడలు నిద్ర లేచింది. తీవ్ర గాయాలతో రక్తం మడుగుల్లో ఉన్న 67 ఏండ్ల అత్తను పొరుగువారి సహాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఈ నెల 1న చనిపోయింది. కోడలు స్టేట్మెంట్ ఆధారంగా హత్య కేసు నమోదు చేసిన పోలీసులు వృద్ధుడైన శంకర్ను అరెస్ట్ చేశారు.