నల్లగొండ : చిట్యాల మండలం వెలిమినేడులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం హిందీస్ రసాయన కంపెనీలో రియాక్టర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. మంటలు ఎగిసి పడుతుండటంతో.. స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. సమీప ప్రాంతాల ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.