మెదక్ : కరెంట్షాక్తో రైతు మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని శివ్వంపేట మండలం గోమారంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోమారం గ్రామానికి చెందిన పెరుకుంట నర్సింలు (50) బర్రెలకు పచ్చిగడ్డి కోస్తుండగా బోరుమోటరు సర్వీస్ వైర్ తగిలి కరెంట్షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
బహుజన తత్వవేత్త జ్యోతిరావు పూలే : మంత్రి పువ్వాడ
‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల కోలాహాలం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే : మంత్రి ఐకే రెడ్డి
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే