కాచిగూడ : ట్యూషన్కు వెళ్లిన డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం బాగ్ లింగంపల్లిలోని సంజీవ్నగర్ ప్రాంతానికి చెందిన రాజేశ్ కుమార్తె మన్వీ కోయల్పర్ పుల్కల్ (18) బర్కపురలోని శ్యామలాదేవి కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.
ఈ నెల 8న ట్యూషన్కు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పిన మన్వీ కోయల్పర్ పుల్కల్ ఇప్పటికి తిరిగి రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు ఇళ్లలో వెతికినా ఆచూకి లభించకపోవడంతో తండ్రి రాజేశ్ బుధవారం కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇంట్లోంచి మన్వీ వెళ్లే సమయంలో క్రీమ్ రంగు టాప్, లేత ఆరెంజ్ రంగు లెగ్గింగ్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.