ముంబై: షేవింగ్ చేయించుకుంటున్న కస్టమర్ కళ్లలో కారం చల్లి అతడి మెడలోని గోల్డ్ చైన్ను ఒక వ్యక్తి చోరీ చేశాడు. మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొత్వాల్ నగర్లో శుక్రవారం సాయంత్రం ఒక వ్యక్తి సెలూన్లో షేవింగ్ చేయించుకుంటున్నాడు. ఇంతలో అక్కడకు వచ్చిన మరో వ్యక్తి షేవింగ్ చేయించుకుంటున్న కస్టమర్ కళ్లలో కారం పొడి చల్లాడు. అతడి మెడలో ఉన్న బంగారం గొలుసును లాక్కొని పారిపోయాడు. ఈ ఘటనపై బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడ్ని 30 ఏండ్ల భరత్ కశ్యప్గా గుర్తించినట్లు రాణా ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.