బంజారాహిల్స్ : భార్యను వేధింపులకు గురిచేస్తున్న భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపై జూబ్లీహిల్స్ పోలీసులు గృహహింస చట్టంతో పాటు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మక్తల్కు చెందిన పల్లె జయమ్మ 2016లో సాయితేజ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది.
మూడేండ్లపాటు భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా భర్త సాయితేజతో పాటు అతడి సోదరి లక్ష్మీభవానీ, బావ రమేష్లు జయమ్మను వేధింపులకు గురిచేస్తున్నారు. కులం పేరుతో దూషించడంతో పాటు పలుమార్లు దాడి చేశారు.
ఇటీవల వారి పెళ్లి ఫోటోలు కూడా చింపేశారు. వారి చిత్రహింసలు భరించలేక బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా భర్త సాయితేజతో పాటు ఇతర కుటుంబ సభ్యులపై ఎస్సీ అట్రాసిటీతో పాటు గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు.