జాతీయ రహదారి 44పై ఇద్దరి దుర్మరణం
కొత్తకోట, జూన్28 : ముందు వెళ్తున్న లారీని ఓ కారు అతి వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని ముమ్మళ్లపల్లి సమీపంలో జాతీయ రహదారి 44పై చోటుచేసుకొన్నది. కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన బంగారం వ్యాపారి గుమ్మడి ఆనంద్కుమార్(38), పామిడి మండల కేంద్రానికి చెందిన నూర్ అహ్మద్(36)గా పోలీసులు గుర్తించారు.