ముంబై : మహారాష్ట్రలోని వసిం జిల్లాలో రూ. లక్షన్నర విలువైన మంగళసూత్రాన్ని బర్రె మింగేసిన ఘటన కలకలం రేపింది. బర్రెకు సర్జరీ చేసి మంగళసూత్రాన్ని బయటకు తీశారు. రైతు రామ్హరి భార్య స్నానానికి వెళుతూ సోయాబీన్, వేరుశనగపప్పులతో నిండిన ప్లేట్లో మంగళసూత్రాన్ని ఉంచింది. ఆపై స్నానం చేసిన తర్వాత ఇంటిపనుల్లో నిమగ్నమైంది.
కొద్దిసేపటి తర్వాత తన తాళి కనిపించడం లేదనే విషయం గుర్తుకువచ్చి ఇల్లంతా వెతికింది. అటుపై తాను ప్లేట్లో మంగళసూత్రాన్ని పెట్టిన విషయం గుర్తుకువచ్చి అందులో చూడగా లేకపోవడంతో కంగుతింది. బర్రెకు ఆహారం ఇచ్చే ప్లేట్లో గోల్డ్ చైన్ను పెట్టడంతో పరుగున వెళ్లి చూడగా చైన్ మిస్ అయింది.
భర్తకు సమాచారం అందించడంతో ఆయన స్ధానిక పశువైద్యాధికారిని సంప్రదించాడు. బర్రె కడుపును పశువైద్యాధికారి మెటల్ డిటెక్టర్తో పరిశలించగా లోపల వస్తువు ఉన్నట్టు వెల్లడైంది. దీంతో బర్రెకు ఆపరేషన్ నిర్వహించి బంగారు మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Read More :