మెదక్ : చేగుంట పరిధిలోని నార్సింగ్ మండలం సంకాపూర్ రైల్వే ట్రాక్పై బర్రె పడుకొని ఉంది. వేగంగా వచ్చిన తిరుపతి – నాందేడ్ ఎక్స్ప్రెస్.. బర్రెపై నుంచి దూసుకెళ్లింది. అయితే చివర్లో రైలు చక్రాలకు, పట్టాలకు మధ్య బర్రె ఇరుక్కుపోయింది. అప్రమత్తమైన లోకోపైలట్ రైలును నిలిపివేశారు. సంకాపూర్ రైల్వే ట్రాక్పైనే నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు 45 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బర్రెను పట్టాలపై నుంచి తొలగించిన తర్వాత నాందేడ్ ఎక్స్ప్రెస్ బయల్దేరింది.