దమ్మపేట, ఫిబ్రవరి 25 : మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం సమావేశం అయ్యారు.
మండలంలోని తాటిసుబ్బనగూడెంలోని మెచ్చా నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారు పార్టీ బలోపేతం, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని చర్చించుకున్నారు.