యాచారం : ప్రమాదవశాత్తు డిటర్నేటర్లు పేలి ఇరువురికి గాయాలైన సంఘటన మండలంలోని మల్కీజ్గూడ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన కథనం ప్రకారం.. మల్కీజ్గూడ గ్రామ సమీపంలోని గుండెల్లి మల్లేశ్ బావి వద్ద అదే గ్రామానికి చెందిన రాజశేఖర్, లక్ష్మణ్లు పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించి తగుల బెట్టారు. ఇంతలోనే పెద్ద శబ్దంతో కూడిన పేలుడు సంబవించింది. ప్రమాదంలో రాజశేఖర్, లక్ష్మణ్లు గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే దవాఖానకు తరలించారు. వ్యవసాయ బావి ఊరికి అతి సమీపంలో ఉండగా పేలుడు దాటికి పశువుల పాక రేకులు ఎగిరిపడటంతో పాటు మూడు ఇండ్లు ధ్వంసమయ్యాయి.
ఇందులో రెండిండ్ల పైకప్పు రేకులు ధ్వంసమవగా, ఓ ఇంటి అద్దాలు పగిలిపోయాయి. చెత్త చెదారంలో ఉన్న డిటర్నేటర్లకు నిప్పంటుకోవడంతోనే పేలుడు సంబవించినట్లు పోలీసులు గుర్తించారు. డిటర్నేటర్లు ఎక్కడినుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.