బంజారాహిల్స్ : అతివేగంతో బైక్పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో అక్కడకిక్కడే మృతి చెందాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఫిలింనగర్ సైట్-2లో నివాసం ఉంటున్న నిర్మాత సురేష్బాబు కొడుకు అభిరామ్ వద్ద నగేష్ (26) అనే యువకుడు గత కొంతకాలంగా కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సమీపంలోనే ఉన్న సురేష్బాబు గెస్ట్ హౌజ్లో నివాసం ఉంటున్న నగేష్ శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత తన పల్సర్ -200 బైక్పై జూబ్లీహిల్స్ రోడ్ నెం 86 మీదుగా వెళ్తున్నాడు.
సరిగ్గా హకీంబాబా దర్గా సమీపానికి రాగానే అదుపుతప్పిన బైక్ డివైడర్ను ఢీ కొట్టింది. దాంతో తీవ్ర గాయాలపాల యిన నగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్త బైక్ కావడంతో పాటు స్పీడ్ను నియంత్రించలేకపోవడంతో ప్రమాదానికి కారణమని పోలీసులు బావిస్తున్నారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. నగేష్ మద్యం సేవించాడా లేదా అనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.