ముంబై: ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్, హోటల్ గదిలో అనుమానాస్పదంగా మరణించింది. ఒక కేసు దర్యాప్తు కోసం ఇతర రాష్ట్రానికి వెళ్లిన ఆమె అక్కడ చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 25 ఏళ్ల కవితా కుమారి బీహార్ ముజఫర్పూర్ జిల్లాలోని బ్రహ్మపుత్ర పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్గా పని చేస్తున్నది. 2021లో నమోదైన చీటింగ్ కేసుపై దర్యాప్తు కోసం ఆమెతోపాటు మరి కొందరు పోలీసులు మహారాష్ట్రలోని పూణేకు వెళ్లారు.
అయితే మహిళా పోలీస్ కానిస్టేబుల్ కవితా కుమారి గురువారం మధ్యాహ్నం బావధాన్లోని చాందినీ చౌక్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ గదిలో అనుమానాస్పదంగా మరణించింది. సమాచారం అందుకున్న పూణేలోని హింజేవాడి పోలీస్ స్టేషన్ పోలీసులు ఆ హోటల్కు వెళ్లి పరిశీలించారు. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ప్రాథమిక ఆధారాల ఆధారంగా అనుమానిస్తున్నారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా పోలీసులతో కలిసి పూణే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.