బెంగళూరు: భార్యతో వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తిని హత్య చేసేందుకు భర్త ఆరు గంటలకుపైగా మంచం కింద దాక్కున్నాడు. అర్థరాత్రి వేళ భార్య టాయిలెట్కు వెళ్లగా గడియపెట్టి ఆమె ప్రియుడ్ని హత్య చేశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. భరత్ కుమార్ అనే వ్యక్తి కార్పెంటర్గా పని చేస్తున్నాడు. అతడికి ఎనిమిదేండ్ల కింద వినుతతో పెండ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు.
కాగా, వినుత స్నేహితుడు శివరాజ్ మూడేండ్ల కిందట ఉద్యోగం కోసం ఆమెను కలిశాడు. అనంతరం వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భరత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేసినా వారు కొనసాగిస్తున్నారు. దీంతో తన కుటుంబాన్ని, జీవితాన్ని నాశనం చేసిన శివరాజ్ను చంపాలని భరత్ నిర్ణయించాడు.
ఈ నెల 24న బుధవారం వారిద్దరు కలుసుకునే ఇంటికి వచ్చి మంచం కింద దాక్కున్నాడు. రాత్రి 10.30 గంటలకు శివరాజ్ ఇంటికి రాగా భోజనం అనంతరం వారిద్దరు నిద్రించారు. అర్థరాత్రి వేళ భార్య వినుత బాత్రూమ్కు వెళ్లగా బయట నుంచి గడియపెట్టిన భరత్, నిద్రిస్తున్న శివరాజ్ను కత్తితో పొడిచి హత్య చేశాడు.
నిందితుడు భరత్కుమార్ను పోలీసులు అరెస్ట్ చేయగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్కు తరలించారు.