అమరావతి : ఏపీలోని పశ్చిమ గోదావరి (West Godavari ) జిల్లా కోడేరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు దుర్మరణం చెందారు. తూర్పుపాలెంలో జరిగిన ఆసరా కార్యక్రమంలో పాల్గొని తిరిగి గ్రామానికి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా (Auto Overturn) పడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ముత్యాలపల్లికి గ్రామానికి చెందిన వాసుదేవ(13), నాగరాజు(12) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు (Police Case) నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.