బంజారాహిల్స్ : రెస్టారెంట్ ముందు పార్క్ చేసిన బైక్ మాయమయిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్
పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
లంగర్ హౌజ్ సమీపంలోని మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న అరవింద రొక్కమ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ నెల 10న తన యమహా ఫాసినో బైక్ (టీఎస్07ఎఫ్ఎస్ 6834) ను బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని పక్కాలోకల్ రెస్టారెంట్ ఎదురుగా పార్క్ చేశాడు.
డిన్నర్ ముగించుకున్న తర్వాత బైక్ను అక్కడే ఉంచి తన స్నేహితుడి కారులో ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటిరోజు ఉదయం వచ్చి చూడగా పార్కింగ్లో బైక్ కనిపించలేదు. అన్ని ప్రాంతాల్లో గాలించినా లాభం లేకపోవడంతో గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.