చాంద్రాయణగుట్ట : ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న పాతనేరస్తుడిన్ని ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్కు తరలించారు.ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..కందికల్గేట్ ప్రాంతానికి చెందిన స్వచ్చ ఆటోడ్రైవర్గా పని చేస్తున్న ముత్యాల మహానంది ఈ నెల 24న ఇంటికి తాళం వేసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కర్నూల్ జిల్లా అత్తికల్లు గ్రామానికి వెళ్లాడు.
తిరిగి ఈ నెల 28న ఇంటికి చేరుకున్నాడు. తాళం పగ్గలగొట్టి ఉండటంతో ఆందోళన చెందిన ఆయన ఇంట్లోకి వెళ్లి చూడగా విలువైన వస్తువులు కనిపించలేదు.దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చోరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా కందికల్గేట్ ప్రాంతానికే చెందిన పాతనేరస్తుడు గువ్వల సుమన్ (23) చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి హెచ్.పీ ల్యాప్టాప్, ఒరిజినల్ పాస్పోర్ట్, టీవీ.స్వాధీనం చేసుకున్నారు.ఇప్పటికే గ్రేటర్, నగర శివారు ప్రాంతంలో నిందితుడిపై 14 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం నిందితుడిని రిమాండ్కు తరలించారు.కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.