మెహిదీపట్నం :డూప్లికేట్ తాళం చెవులతో ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్న ఓ దొంగను ,అతడికి సహకరిస్తున్న ఓ బాలుడిని హుమాయూన్నగర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 13 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో జాయింట్ కమీషనర్, డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, ఆసిఫ్నగర్ ఏసీపీ ఆర్.జీ..శివమారుతి, హుమాయూన్నగర్ ఇన్స్పెక్టర్ సునీల్, అదనపు ఇన్స్పెక్టర్ నారాయణరెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు.
బహుదూర్పురా ఇక్బాల్ కాలనీకి చెందిన జహరుల్ హసన్(32)జల్సాలకు అలవాటు పడ్డాడు. డబ్బులు సులువుగా సంపాదించాలన్న ఆశతో డూప్లికేట్ తాళాలను ఉపయోగించి ద్విచక్రవాహనాలను దొంగిలించడం ప్రారంభించాడు. బుధవారం హుమాయూన్నగర్ పోలీసులు ఇతడిని పట్టుకున్నారు. ఇతడికి సహకరిస్తున్న ఓ బాలుడిని కూడా గురువారం పట్టుకుని వారి వద్ద నుంచి 13 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జహరుల్ హసన్ను జైలుకు, బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.