ముంబై : బాలీవుడ్ నటి అనన్య పాండేకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు బుధవారం సమన్లు జారీ చేశారు. ఈరోజు మద్యాహ్నం 2 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. క్రూయిజ్ పార్టీ కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ పార్టీ నేపధ్యంలో అనన్య పాండేతో చాటింగ్ చేసినట్టు ఎన్సీబీ అధికారులు కనుగొన్నారు.
చాట్ మెసేజ్లను ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణకు ముందు కోర్టుకు సమర్పించారు. మరోవైపు అనన్య పాండే ఫోన్ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక షారుక్ ఖాన్ నివాసం మన్నత్ సహా అనన్య పాండే ఇండ్లపై ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.