మేడ్చల్ మల్కాజ్గిరి : పీకల దాకా మద్యం సేవించిన ఓ యువకుడు నడిరోడ్డుపై నానా హంగామా సృష్టించాడు. ట్రాఫిక్ పోలీసులను అసభ్యకర పదజాలంతో దూషించాడు. అంతటితో ఆగకుండా.. పోలీసులపై రాళ్లతో దాడి చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలోని సూరారం ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.
మల్లారెడ్డి ఆస్పత్రి వద్ద ఓ యువకుడు తన బైక్పై రాంగ్రూట్లో వచ్చాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఆ యువకుడిని ఆపారు. మద్యం మత్తులో ఉన్న ఆ ద్విచక్ర వాహనదారుడు.. రాళ్లతో దాడి చేసేందుకు యత్నించాడు. అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఆ యువకుడు రాళ్ల దాడి చేసినా, బూతులు తిట్టినప్పటికీ.. జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, సిబ్బంది సంయమనం పాటించారు. చివరకు ఆ మందుబాబును బంధించారు. అనంతరం దుండిగల్ పీఎస్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.