హైదరాబాద్ : ఓ భర్త పీకల దాకా మద్యం సేవించాడు. ఆ తర్వాత ఇంటికొచ్చాడు. తన భార్యతో సరదాగా ఉందామనుకున్నాడు. ఇంకేముంది.. భార్య బుగ్గను గట్టిగా కొరికేశాడు. ఆమె గట్టిగా కేకలు వేసింది. తన బుగ్గను కొరికిన భర్తపై కేసు నమోదు చేయాలంటూ.. ఆమె పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. ఈ విచిత్రమైన ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు పరిధిలోని కానూరు కేసీపీ కాలనీలో చోటు చేసుకుంది.
కేసీపీ కాలనీకి చెందిన స్రవంతి, రాంబాబు భార్యాభర్తలు. రాంబాబు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తుండగా, భార్య ఇంటి దగ్గరే ఉంటుంది. రాంబాబు మద్యానికి బానిస అయ్యాడు. ప్రతి రోజు పీకల దాకా మద్యం సేవించి, భార్యను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. మంగళవారం రాత్రి కూడా సెక్యూరిటీ గార్డ్ మద్యం సేవించి ఇంటికొచ్చాడు. మద్యం మత్తులో భార్య బుగ్గ కొరికాడు. దీంతో ఆమె కేకలు వేసింది. చెంపకు తీవ్ర గాయం కావడంతో ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తన భర్త బుగ్గ కొరికాడని, కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆవిడ ఫిర్యాదును చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. ఎంతకీ వినకపోవడంతో కేసు నమోదు చేయక తప్పలేదు.