మాదాపూర్, నవంబర్ 19: భార్యను చంపేందుకు వచ్చిన ఓ వ్యక్తి..బావమరిదిని కత్తితో పొడిచాడు. మాదాపూర్ ఎస్సై రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం… గచ్చిబౌలిలోని మై హోమ్ భూజాలో నివాసముంటున్న మల్లారెడ్డి, జ్యోత్స్న దంపతులు వృత్తిరీత్యా వైద్యులు. కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఇటీవల జ్యోత్స్న చందానాయక్తండాలోని తన తల్లి ఇంటికి వచ్చింది. భార్య తన వద్దకు రావడం లేదన్న కోపంతో ఆమెను హత మార్చాలనే ఉద్దేశంతో శుక్రవారం సాయంత్రం మల్లారెడ్డి కత్తిని తీసుకొని అత్తగారింటికి వచ్చాడు. భార్యతో గొడవపడుతుండగా, ఆమె చెల్లెలు, తమ్ముడు శివానంద్రెడ్డి కలుగజేసుకున్నారు. ఆగ్రహించిన మల్లారెడ్డి బావమరిదిని వెన్నులో పొడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.