మునిపల్లి /సంగారెడ్డి : అక్రమంగా తరలిస్తున్న 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బుదేరా చౌరస్తాలో తాజ్ ధాబా వద్ద రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని గుర్తించి పట్టుకున్నట్లు డీటీసీఎస్ మానసా తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపుదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె హెచ్చరించారు.